మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి వాహనంపై దాడి చేసిన పొన్నాల వర్గీయులు..

ప్రస్తుతం తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గాల మధ్య వాదనలు జరుగుతున్నాయి. తాజాగా సిద్దిపేటలో తమ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం కు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పాల్గొనడానికి వెళ్లగా అక్కడ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గీయులు ప్రతాప్ రెడ్డి ని అడ్డుకున్నారు.

మద్దూరు మండలం కూటిగల్ లో ప్రతాప్ రెడ్డి వాహనాన్ని అడ్డుకొని ఆ వాహనం పై దాడి చేశారు. ఇక ఆ దాడిలో కారు ధ్వంసం కాగా సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ వాతావరణాన్ని సద్దుమణిగేలా చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్గీయుల మధ్య వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.