Pm Modi: మొదటిసారిగా తన తల్లి గురించి ఎన్నికలలో మాట్లాడిన మోదీ..?

Pm Modi: దేశ ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా అమేథీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఈ ఎన్నికలలో భాగంగా ఎప్పుడు ఎక్కడ తన తల్లి గురించి ప్రస్తావించని నరేంద్ర మోడీ ఈ ఎన్నికల ప్రచారంలో తన తల్లి గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. అతను తన తల్లి హీరాబెన్ మోదీ వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా తన తల్లికి ప్రస్తుతం 100 ఏళ్ళు వయసు ఉన్నప్పటికీ వ్యాక్సిన్ కోసం ఎప్పుడూ తాపత్రయపడే లేదని తెలిపారు. వ్యాక్సిన్ సమయం వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు మోదీ తెలిపారు.

అదే విధంగా తన తల్లికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అదేవిధంగా ఆమె బూస్టర్ డోసును కూడా తీసుకోలేదని వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్, నవాజ్ వాది పార్టీలపై విరుచుకుపడ్డారు. వారిని పరోక్షంగా రాజ వంశీకుల తో పోల్చి వారి నిబంధనలను పాటించకుండా వ్యాసం తీసుకోవడం కోసం ముందు వరుసలో ఉండే వారు అంటూ విమర్శలు గుప్పించారు నరేంద్ర మోడీ. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే వ్యాక్సిన్లను అమ్ముకునేవారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.