PM Kisan Yojna: రైతులకి మోడీ సర్కార్ గుడ్ న్యూస్.! జనవరి 1న పీఎం కిసాన్ నిధులు జమ

PM Kisan Yojna: దేశంలోని రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. నూతన సంవత్సరం సందర్భంగా.. అంటే జనవరి 1 వ తేదీన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం 10వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో.. పి ఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను విడుదల చేసినట్లు. జనవరి 1వ తేదీ నుంచి పదో విడత డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యం తోనే ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. కాగా ఈ పథకం కింద కేంద్రం ఏటా రైతుల ఖాతాల్లో మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు జమ చేస్తోంది దీనివల్ల దేశ వ్యాప్తం గా 12 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఇక ఈ పథకం డబ్బులను https://pmkishan.gov.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.