PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన డబ్బులు పడటం లేదా.. అయితే ఇలా చెయ్యాల్సిందే !

PM Kisan Yojan: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అతి ప్రతిష్టాత్మకమైన పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ యోజన ఒకటి. ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయం కింద ఎకరానికి 2వేల చొప్పున ఏడాదికి రెండుసార్లు రైతుల బ్యాంకు ఖాతాలోకి నగదుని జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బంధు మాదిరిగానే ఈ పథకం కూడా పని చేస్తుంది. అయితే చాలామంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు అందడం లేదు. కిసాన్ యోజన డబ్బులు ఖాతాలో పడాలంటే కొన్ని రూల్స్ అయితే పాటించాల్సిందే.

ముఖ్యంగా డబ్బులు ఖాతాలో పడాలంటే మొట్టమొదటిగా చెయ్యాల్సిన పని ఆధార్ కార్డును లింక్ చేయాలి. అంతే కాకుండా ప్రధానమంత్రి కిసాన్ ఖాతా వివరాలు, ఆధర్ కార్డులోని వివరాలు కరెక్టుగా ఉంటేనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. దానికోసం బ్యాంకు కి వెళ్లి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ పైన సంతకం చేసి ఇవ్వాలి.

ఆధార్ కార్డ్ వివరాలను ముందుగా వెరిఫై చేసి ఆ తర్వాత ఆన్ లైన్ సీడింగ్ చేస్తారు. వెరిఫికేషన్ అయిన పిమ్మట ఫోన్ కు sms వస్తుంది. ఆ తరువాత ప్రధాన మంత్రి కిసాన్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చుసులోవాలి.