అక్కడ కూడా కాంగ్రెస్ ఓటమే అంటున్న పీకే..!

కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములను సొంతం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు బలహీనంగా మారారు. దీంతో పార్టీ బలోపేతం లక్ష్యంగా రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఇటీవలే మూడు రోజుల ‘చింతన్ శివిర్’ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమం గురించి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

ఉదయపూర్ చింతన్ శివిర్ గురించి మాట్లాడాలని తనను పదేపదే అడుగుతున్నారు అంటూ.. తన అభిప్రాయంలో అదో విఫలమైన ప్రయత్నమని అన్నాడు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో రాబోయే ఎన్నికల ఓటమి వరకు కాంగ్రెస్ అధినాయకత్వానికి సమయం ఇవ్వడం, యథాతథ స్థితిని మరి ఇంత కాలం కొనసాగించడానికి తప్ప అర్థవంతమైన పరిష్కారాన్ని సాధించడంలో ఆ శిబిరం విఫలమైందని అన్నాడు.