నీ బిల్లు నువ్వే కట్టుకో.. పూజా హెగ్డేకు షాక్ ఇచ్చిన నిర్మాతలు!

దక్షిణాది సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూజా హెగ్డే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈమె తన కెరీర్లో వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ సరసన జనగణమన, మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమెకు నిర్మాతల నుంచి చేదు అనుభవం ఎదురైనట్టు వార్తలు వస్తున్నాయి.

పూజా హెగ్డే ఒక సినిమాలో నటించడం కోసం సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు.ఇలా రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా తన స్టాప్ కోసం అయ్యే ఖర్చులను కూడా నిర్మాతలు భరించాల్సి ఉంటుందని ఈమె ముందుగానే అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే తమిళ హీరో విజయ్ సరసన పూజా హెగ్డే నటించిన సినిమా షూటింగ్ సమయంలో పూజా హెగ్డే తన స్టాఫ్ ఖర్చులు భారీగా వచ్చాయి. కేవలం వీరి తిండి కోసమే లక్షలలో బిల్లు అయిందని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఇలా అధిక నష్టాల్లో కూరుకుపోయిన నిర్మాతలకు పూజా హెగ్డే ఖర్చులు మరింత భారం అయ్యాయి. ఈ క్రమంలోనే పూజా హెగ్డే తన స్టాఫ్ కోసం అయిన ఖర్చులను తానే భరించుకోవాలని నిర్మాతలు తనకు బిల్ పంపినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.