ఆర్ఆర్ఆర్ సెట్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

తెలుగు సినిమా స్థాయిని ఖండాంత‌రాలు దాటించిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఓటమెరుగ‌ని విక్ర‌మార్కుడుగా పేరు తెచ్చుకున్న రాజ‌మౌళి ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న చిత్రాన్ని అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి వ‌స్తున్న అప్‌డేట్స్ ఫ్యాన్స్‌ను సంతోష‌ప‌రుస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ చిత్రం ప్ర‌స్తుతం అల్లూమినియం ఫ్యాక్ట‌రీలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. కీల‌క స‌న్నివేశాల‌ని చిత్రీక‌రిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతున్న ప‌రిస‌రాల‌లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-రానా ప్ర‌ధానా పాత్ర‌ల‌లో రూపొందుతున్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటుంద‌ట‌. త‌న అన్న కొడుకు రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ కావ‌డంతో గ్యాప్‌లో సెట్స్‌కు వెళ్లి కొద్ది సేపు చిత్ర బృందంతో ముచ్చ‌టించి వ‌చ్చార‌ట‌. త‌మ సెట్‌కు ప‌వ‌న్ వ‌చ్చే స‌రికి ప్ర‌తి ఒక్క‌రు షాక్ కావ‌డ‌మే కాక ఆనందం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తుంది.

ఆర్ఆర్ఆర్ సెట్‌లో అడుగుపెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీకి సంబంధించి ప‌లు విష‌యాల‌ను రాజ‌మౌళితో చ‌ర్చించాడ‌ట‌. అలానే షూటింగ్ విధానాన్ని కూడా ప‌రిశీలించార‌ట‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న విధానానికి ప‌వ‌న్ ఫుల్ ఇంప్రెస్ అయ్యాడ‌ని తెలుస్తుంది. గ‌తంలో ఆర్ఆర్ఆర్ సెట్‌కు ప‌లువురు సెల‌బ్రిటీలు వెళ్ల‌గా, ఇప్పుడు ప‌వ‌న్ హాజ‌రు కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. కాగా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన వ‌కీల్ సాబ్ చిత్రం మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ప్ర‌స్తుతం క్రిష్ చిత్రంతో పాటు మ‌ల‌యాళ మూవీ రీమేక్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. త్వ‌ర‌లో హ‌రీష్ శంక‌ర్ మూవీని కూడా మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తుంది.