Pawan Kalayan: తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా బ్యాటరీ సైకిల్ నడిపారు. ప్రస్తుతం ఇందుకు సంబందించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూ బ్యాటరీతో నడిచే సైకిల్ ను తయారు చేశాడు. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ రాజాపు సిద్దూను ప్రత్యేకంగా అభినందించారు.
సరికొత్త ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్దూ ఆవిష్కరించిన సైకిల్ ని స్వయంగా నడిపారు. అతని ఆలోచనలు తెలుసుకుని అబ్బురపడ్డారు. సిద్ధూ రూపొందించిన గ్రాసరీ గురూ వాట్సప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు. అతని ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని ఆకాంక్షిస్తూ రూ.లక్ష ప్రోత్సాహకం అందించారు.
బ్యాటరీ సైకిల్ సిద్ధూని అభినందించిన శ్రీ @PawanKalyan గారు
•వినూత్న ఆవిష్కరణను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
•రూ. లక్ష ప్రోత్సాహకం అందజేతఅతి తక్కువ ఖర్చుతో.. బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని రాష్ట్ర… pic.twitter.com/Vb1SJRJPYQ
— JanaSena Party (@JanaSenaParty) July 9, 2025
ఈ సందర్భంగా బ్యాటరీ సైకిల్ పై సిద్ధూని కూర్చోబెట్టుకొని నడిపారు పవన్ కల్యాణ్. సిద్ధూ విషయానికొస్తే..విజయనగరం జిల్లా, జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన వ్యక్తి సిద్ధూ. చాలా దూరంలో ఉన్న కాలేజీకి వెళ్లడం కోసం స్వయంగా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాడు. మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి తోడు తక్కువ ఖర్చుతోనే ఈ బ్యాటరీ సైకిల్ ని రూపొందించడంతో అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సిద్దూనీ తన సైకిల్ పై ఎక్కించుకొని మరి కొద్దిసేపు ట్రావెల్ చేశారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా సిద్దుకి హగ్ ఇచ్చి అతడిని మెచ్చుకున్నారు.
