Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తర్వాత జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడుతూ వచ్చారు. దాదాపు పది సంవత్సరాలు పాటు పార్టీ కోసం కష్టపడి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు అయితే ఈయన పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే విజయం సాధించారు. దాదాపు 70 వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు దీంతో పిఠాపురం జనసేన అడ్డా అంటూ జన సైనికులు భావిస్తున్నారు.
పిఠాపురంలో తెలుగుదేశం అత్యంత బలంగా ఉంది. ఆ పార్టీ నాయకులు కూడా గట్టిగా ఉన్నారు. మరో వైపు వైసీపీ కూడా బలంగానే ఉంది. ఈ తరుణంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కు ఏ స్థాయిలో బలం ఉందనే విషయంపై ఇటీవల పలు సర్వేలు షాకింగ్ విషయాలను వెల్లడించాయి.గత పది నెలలలో జనసేన ఏ విధంగా విస్తరించింది ఎంత మేరకు పటిష్టం అయింది అన్నది చర్చకు వస్తోంది.
పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తే నియోజకవర్గం బాగు పడుతుందని చూస్తే పెద్దగా డెవలప్ అయ్యే పరిస్థితి లేదు అని అంటున్నారు. ఇక పిఠాపురానికి నాగబాబు వస్తే చాలు ప్రతీ సారీ రెచ్చగొట్టే మాటలే మాట్లాడుతున్నారు. దీంతో జనసేనకు పిఠాపురంలో కాస్తమైన అయిందని చెప్పాలి.జనసేన అడ్డా అని నాగబాబు ఇతరులు ఎంతలా రీ సౌండ్ చేసి చెబుతున్నా కూడా జనసేనకు పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీద బలం అయితే పెద్దగా లేదు అని అంటున్నారు. అంతే కాదు సంస్థాగతంగా పట్టు పెంచుకోవడం లేదు. బూత్ స్థాయిలో పనిచేసే నాయకులు జనసేనకు లేరు అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ వర్మ సహాయంతో విజయం సాధించి డిప్యూటీ సీఎం గా బాధ్యతలను తీసుకొని తన పనులలో తాను ఉటున్నారు కానీ తన పార్టీకి గ్రౌండ్ లెవెల్ లో ఎక్కడ స్టామినా లేదని తన పార్టీని బలపరుచుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని తెలుస్తోంది. ఇక కూటమి అధికారంలో ఉన్నప్పటికీ చాలాచోట తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులకు మంచి పదవులు ఉన్నాయి. వారి పనులు కూడా అవుతున్నాయి కానీ జనసేన నాయకులు పనులు మాత్రం కావడం లేదు.
ఇటీవల ఒక సర్వే వచ్చింది. అందులో ప్రకారం చూస్తే కనుక ఒకవేళ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో జనసేనకు ఒక సీటూ కూడా రాదు అని అంటున్నారు. పిఠాపురంలోనే ఆ పార్టీకి పవన్ కి కూడా థర్డ్ ప్లేస్ వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే చెబుతోంది. ఇలా పవన్ పొత్తులో కాకుండా సింగిల్గా పోటీచేసే గెలిచే అవకాశం లేదని తన పార్టీ గ్రౌండ్ లెవెల్ లో చాలా వీక్ గా ఉందని తెలుస్తోంది.