భారీగా రెమ్యూనరేషన్ పెంచిన పవిత్ర లోకేష్.. ?

పవిత్ర లోకేష్ పరిచయం అవసరం లేని పేరు. మొన్నటివరకు ఈమె తెలియని వారు ఉన్నప్పటికీ నరేష్ వ్యవహారంతో ఈమె అందరికీ భాగ సుపరిచితమయ్యారు. కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా సందడి చేసిన ఈమె పలు సినిమాలలో హీరోయిన్గా నటించినప్పటికీ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. తెలుగులో కూడా ఈమె పలు సినిమాలలో తల్లి పాత్రలలో నటిస్తూ తల్లిపాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఇలా ఎన్నో సినిమాలలో నటించి తెలుగులో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న పవిత్ర లోకేష్ తాజాగా వార్తలలో నిలిచిన విషయం మనకు తెలిసిందే.

ఈమె నటుడు నరేష్ తో కలిసి సహజీవనం చేస్తున్నారని త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ కావడంతో ఈ వార్తలపై నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున వీరిపై విమర్శలు చేశారు. ఇలా ఈ ముగ్గురు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇక వీరి వ్యవహారం శృతి మించడంతో రమ్య రఘుపతి ఏకంగా వారిద్దరిపై చెప్పుతో దాడికి కూడా ప్రయత్నం చేస్తుంది.

ఈ విధంగా పవిత్ర లోకేష్ వార్తల్లో నిలవడంతో ఈమె కెరియర్ సమాప్తం అయిందని తనకు అవకాశాలు రావడం కూడా చాలా అరుదు అని అందరూ భావించారు.అయితే ఊహించని విధంగా పవిత్ర లోకేష్ తన రెమ్యూనరేషన్ పెంచేసి అందరినీ షాక్ కి గురి చేశారు. పవిత్ర లోకేష్ ఇదివరకు ఒక్క కాల్ షీట్ కోసం 60 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఈ వివాదం తర్వాత ఈమె ఒక్కో కాల్ షీట్ కి లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఏకంగా 40 వేల రూపాయల రెమ్యూనరేషన్ పెంచి ఈమె అందరికీ షాక్ ఇచ్చారు. రోజుకు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.