సుచేంద్ర ప్రసాద్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన పవిత్ర లోకేష్.. కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కన్నడ ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభించిన ఈమె దాదాపు 20 కు పైగా సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో మంచి మంచి పాత్రలు పోషించి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. హీరో, హీరోయిన్ లకి తల్లి పాత్రలలో నటించి అందరినీ మెప్పించిన పవిత్ర లోకేష్ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. సీనియర్ నటుడు నరేష్ తో తరచు పవిత్ర కనిపించటంతో వీరిద్దరికి వివాహం జరిగిందని కొందరు అంటుంటే… వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు అంటూ మరొక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

ఇటీవల పవిత్ర లోకేష్, నరేష్ కలిసి స్వామీజీ ని కలవటానికి జంటగా వెళ్లారు. దీంతో వీరిగురించి వస్తున్న వార్తలకు మరింతబలం చేకూరింది. ఇటీవల వీరిద్దరు కలిసి మహాబలేశ్వరం దేవాలయానికి వెళ్లి అక్కడ స్వామీజీని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో వీరి పెళ్లి గురించి వస్తున్న వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా పవిత్ర లోకేష్ తన భర్త గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఐదు సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవిత్ర లోకేష్ తన భర్త గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా పవిత్ర తన భర్త గురించి మాట్లాడుతూ గతంలో మేమిద్దరం కలిసి ఒక సీరియల్ లో కలసి నటించాం. ఆ సమయంలో ఒకరిమీద ఒకరికి ఉన్న అభిమానం వల్ల ఇద్దరం పెళ్ళి చేసుకున్నాం. ఆయన నాకన్నా చాలా గొప్ప వ్యక్తి. ఆయనలో ఒక్క లోపాన్ని కూడా కనిపెట్టలేము.ఆయన లాంటి వ్యక్తిని మరొకరిలో చూడలేము అంటూ చెప్పుకొచ్చింది. ఆయన ఒక రచయిత, దర్శకుడు, నటుడు కూడా. కానీ ఆయన నాకు నటుడిగా మాత్రమే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది. ఆయన నన్ను ఎంతో గౌరవిస్తాడు. అలాంటి వ్యక్తి నాకు భర్తగా దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ పవిత్ర లోకేష్ తన భర్త గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది. ఐదు సంవత్సరాల క్రితం పవిత్ర తన భర్త గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.