Suicide : ఉస్మానియా ఆస్పత్రి నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న పేషంట్…!

Suicide:ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇటీవల తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే…రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, వీరెక్ కాలనీకి చెందిన నాగరాజు కుటుంబ కలహాల కారణంగా ఈనెల 2 వ ఏదైనా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.బట్ట పురుగుల మందు తాగటం గమనించిన నాగరాజు భార్య వెంటనే అతనిని కుటుంబ సభ్యులతో కలిసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నాగరాజు కు మందు తాగే అలవాటు ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మద్యం తాగి వచ్చాడు.హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మద్యం సేవించడం సరికాదని నాగరాజు భార్య అతనిని మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నాగరాజు ఆమెను పక్కకు తోసి ఆస్పత్రిలో ఉన్న నాలుగవ అంతస్తు మీదకు వెళ్లి కిటికీ అద్దాలు పగలగొట్టి అక్కడి నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పై నుండి కిందకు దూకడంతో నాగరాజు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనతో నాగరాజు కుటుంబ సభ్యులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటన గురించి మృతుడి బంధువులను , అతని భార్య నీ పోలీసులు విచారించారు. మృతుడు నాగరాజు భార్య సంతోషిని తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.