తాత మొండితనం తారక్ కు వచ్చిందా.. అందుకే ఎన్టీఆర్ అలా ప్రవర్తించారా?

సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ మధ్య కాలంలో ఏ సర్వే చేసినా ఆ సర్వేలో జూనియర్ ఎన్టీఆర్ టాప్ లో నిలుస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ సాధించడం వల్ల ఎన్టీఆర్ కు ఈ మధ్య కాలంలో ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు తాత మొండితనమే వచ్చిందని ప్రముఖ టాలీవుడ్ రచయితలలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ ఒక సందర్భంలో వీడియోలో పంచుకున్నారు.

ఆది సినిమా గురించి ఆయన చెబుతూ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రాయలసీమకు వచ్చి నీళ్లు తాగే సన్నివేశంలో అతని కళ్లను పరిశీలిస్తే వినాయక్ ఎంత గొప్పగా ఆలోచించి ఈ సినిమాను తీశాడో అర్థమవుతుందని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. విశాఖలో ఆది క్లైమాక్స్ షూటింగ్ జరిగిందని ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేతికి బలమైన దెబ్బ తగిలిందని ఆయన వెల్లడించారు.

దెబ్బ తగిలితే హీరోలు షూటింగ్ ఆపేయడం జరుగుతుందని అయితే తారక్ మాత్రం చేసేస్తానని చెప్పి షూటింగ్ లో పాల్గొన్నాడని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. సర్దార్ పాపారాయుడు మూవీ క్లైమాక్స్ షూట్ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ కు దెబ్బ తగిలిందని అయితే ఆయన షూటింగ్ ఆపకుండా దెబ్బ తగిలినా షూట్ లో పాల్గొన్నారని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. తాత మొండితనం జూనియర్ ఎన్టీఆర్ కు కూడా వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.

తారక్ తనను పెదనాన్న అని పిలిచేవాడని ఎంతో గౌరవం ఇచ్చే టాలీవుడ్ హీరోలలో తారక్ ఒకరని ఆయన కామెంట్లు చేశారు. ఆది సినిమాలో తారక్ బాబాయ్ పాత్రలో తాను యాక్ట్ చేసి ఉంటే బాగుండేదని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటనా సామర్థ్యాన్ని ఆయన ఎంతగానో మెచ్చుకున్నారు.