ఇకపై బందరులో ఉంటా.. కార్యక్రమాల్లో పాల్గొంటా: ఎంపీ బాలశౌరి

ప్రస్తుతం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపాలో వర్గాల మధ్య విభేదాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఎంపీ బాలశౌరి మచిలీపట్నం ను పర్యటించడానికి వెళ్లగా అక్కడ పేర్నినాని వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అసహనానికి గురై.. ఆయనపై తీవ్రమైన విమర్శలు చేశారు.

పేర్ని నాని.. బందరు నీ అడ్డా కాదని.. ఎమ్మెల్యే నాని ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని.. తనను మచిలీపట్నం రానివ్వకుండా చేస్తున్నారు అంటూ.. ఇకపై బందరులో ఉంటా అక్కడి కార్యక్రమాల్లో పాల్గొంటా.. ఎవరేం చేస్తారో చూస్తా.. ఎంపీ అంటే ఏమిటో చూపిస్తా అంటూ సవాల్ విసిరారు. ఇక ఇతర పార్టీ ఎంపీ సుజనా తో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అంటూ.. ఆయన పార్టీని తిడితే స్పందించరు అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.