Parineeti Chopra: దారుణం.. పచ్చి మోసం వెంటనే నా పేరు తొలగించండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిణితి!

Parineeti Chopra: బాలీవుడ్ బ్యూటి పరిణితి చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో సినిమాలలో అద్భుతమైన నటన ద్వారా విశేష ఆదరణ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక చిన్న పిల్లల టాలెంట్ షో విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మోసం దారుణం అంటూ సదరు షో నిర్వాహకుల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆన్లైన్ పిల్లల టాలెంట్ షో కి ఈమెను న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ సదరు కార్యక్రమ నిర్వాహకులు తనని జడ్జ్ గా టాగ్ చేయడంతో ఈ విషయంపై ఈమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆ ట్వీట్ కిసంబంధించిన స్క్రీన్ షాట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.

దారుణం.. పచ్చి మోసం దయచేసి ఇందులో నా పేరును వెంటనే తొలగించాలి చిన్నపిల్లలను అడ్డుపెట్టుకొని ఇలాంటి మోసాలకు తెర లేపడం బావ్యం కాదని అర్థం వచ్చే విధంగా ఈమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇక ఈ విషయంపై ట్విట్టర్‌లో బదులిచ్చిన ‘ఫన్ కిడ్స్ ఇండియా’ ఆన్‌లైన్ ఛానల్ వారు ‘మీ మ్యానేజర్‌తో మేం చర్చల్లో ఉన్నాం. మీరు ఒప్పుకుంటారనే భావించాము. అందుకోసమే ఇక్కడ జడ్జీ స్థానంలో మీ పేరును వెల్లడించామని చెప్పుకొచ్చారు.

ఇలా ఫన్ కిడ్స్ ఇండియా నటి పరిణితి చోప్రాకు వివరించిన ఇప్పటికీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి తన పేరును తొలగించింది. ఈ విధంగా ఆన్లైన్ కిడ్స్ టాలెంట్ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించడానికి తీవ్ర వ్యతిరేకత చూపిన ఈ నటి బుల్లితెరపై ప్రసారమయ్యే హునర్‌బాజ్ పేరుతో ప్రసారం కానున్న కార్యక్రమానికి ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం గమనార్హం.