Pooja Hegde: ఎన్నో సంవత్సరాల పూజా హెగ్డే కోరికను నెరవేర్చిన పాన్ ఇండియా స్టార్..?

Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే, మరొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో హీరోయిన్స్ లో ఎక్కువగా బిజీ గా ఉండే హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే మాత్రమే. ఇటీవలే ఒక కార్యక్రమంలో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్ పూజా హెగ్డే తో ఫోన్ లో మాట్లాడాలి అన్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే అన్నారు అంటే ఆమె ఎంత బిజీగా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే టాలీవుడ్ లో అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన నీలాంబరి పాత్రలో నటించింది. అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. ఈ రెండు సినిమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే ఎంపికయింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోస్ సైతం పూజా హెగ్డే తో మళ్లీ సినిమాలు రిపీట్ చేస్తుండటంతో ఆమెకు అవకాశాలకు కొదవ లేకుండా పోయింది.

ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో తనకు ఎప్పటినుంచో ఒక విభిన్నమైన ప్రేమ కథ చేయాలని కోరికగా ఉందని తెలిపింది. ఆ కోరిక ప్రభాస్ తో నటించిన రాధే శ్యామ్ సినిమాతో తీరిపోయింది అని వెల్లడించింది. ఇంతవరకు తాను నటించిన సినిమాల లోని క్యారెక్టర్ లలో రాధే శ్యామ్ సినిమాలో తన పాత్ర చాలా క్లిష్టమైనది అని చెప్పుకొచ్చింది. రాధే శ్యామ్ సినిమా ఒక పీరియాడికల్ కావడంతో తన పాత్ర ప్రేరణ కోసం ఎంతో పరిశోధన చేయాల్సి వచ్చింది అని తెలిపింది బుట్ట బొమ్మ. ప్రేక్షకులతో పాటు తాను కూడా ఈ సినిమాను వెండితెరపై చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని ఆమె తెలిపింది.