మరోసారి షారుఖ్ ఖాన్ కి నోటీసులు జారీ చేసిన పోలీసులు?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇప్పుడిప్పుడే తన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు నుంచి బయట పడటంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే మరోసారి ముంబై పోలీసుల నుంచి షారుక్ ఖాన్ నోటీసులు అందుకున్నారు. అయితే ఈయనకు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… షారుఖ్ ముంబైలో నివసిస్తున్నటువంటి తన ఇల్లు మన్నత్ అంటే తనకు ఎంత ఇష్టమో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు ఈ ఇంటికి మెరుగులు దిద్దుతూ తన ఇష్టానికి అనుగుణంగా మార్చుకుంటారు.

ఈక్రమంలోనే తనకి ఎంతో ఇష్టంగా భావించే ఈ ఇంటికి మన్నత్ అనే నేమ్ ప్లేట్ తయారు చేయించారు. యూరప్ నుంచి ప్రత్యేకమైన ఖరీదైన స్టోన్ తెప్పించి ప్రత్యేకంగా మన్నత్ అనే పేరును తన భార్య గౌరీ ఖాన్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు.ఈ బోర్డు కోసం సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయం తెలిసి ఎంతో మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇకపోతే తాజాగా షారుక్ ఇంటిముందు ఈ నేమ్ ప్లేట్ బోర్డ్ మాయమయింది.

ఈ నేమ్ బోర్డు కోసం ఉపయోగించిన స్టోన్ ఖరీదు కావడంతో దీనిని దొంగలు చోరీ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నేమ్ బోర్డుకి కాపలా ఉండాలంటే పోలీసులకు ఎంతో కష్టతరంగా మారింది. అందుకే ముంబై పోలీసులు షారుక్ ఖాన్ కి నోటీసులు జారీ చేస్తూ తన ఇంటికి ఉన్నటువంటి నేమ్ బోర్డు తొలగించాలని సూచించారు.అలా తొలగించని పక్షంలో పోలీసులు స్వయంగా ఇంటికి ఉన్న నేమ్ బోర్డ్ తొలగిస్తారని సూచించడంతో షారుక్ ఖాన్ తన ఇంటికి ఉన్న నేమ్ బోర్డ్ తొలగించినట్లు తెలుస్తుంది.