నా తప్పు ఏమాత్రం లేదు…కాస్త మర్యాదగా మాట్లాడండి: తాప్సీ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి నటిగా అందరికీ సుపరిచితమైన సొట్టబుగ్గల చిన్నది తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అయితే తెలుగులో ఈమె నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోవడంతో ఈమె తెలుగు తెరకు దూరమై పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు కమర్షియల్ చిత్రాలలో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా బిజీగా గడుపుతున్న తాప్సీ తాజాగా శభాష్ మిథు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయింది.

ఈ క్రమంలోనే ఈమె నటించిన తదుపరి చిత్రం దోబారా ఆగస్టు 19 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కోసం మీడియా గంటల సమయం కొద్ది ఎదురు చూశారు. అయితే అక్కడికి వచ్చిన తాప్సీ ఏ మాత్రం మీడియాని పట్టించుకోకుండా మీడియా వాళ్ళు పిలుస్తున్నప్పటికీ వెళ్ళిపోయారు. తాప్సీ మేడం గంటల సమయం పాటు వేచి చూసాం లేటుగా వచ్చారు కాస్త ఆగండి అని అరిచినప్పటికీ వెళ్ళిపోయారు.

ఇంటర్వ్యూ అనంతరం బయటకు వచ్చిన తాప్సీ మీడియాపై ఫైర్ అయ్యారు. తాను ఆలస్యంగా రాలేదని సరైన సమయానికి వచ్చానని ఇందులో తన తప్పు ఏమాత్రం లేదని తాప్సి వెల్లడించారు. ఇదే సమయంలోనే ఒక ఫోటోగ్రాఫర్ మీకోసం రెండు గంటల నుంచి ఎదురుచూస్తున్నామని గట్టిగా అరవడంతో మర్యాదగా మాట్లాడండి..మీరు మర్యాదిస్తే నేను కూడా మర్యాదగా మాట్లాడుతాను అంటూ ఓ రేంజ్ లో మీడియా పై ఫైర్ అయ్యారు. ఇలా తాప్సీ మీడియాతో వాగ్వాదానికి దిగడం ప్రస్తుతం బీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది.