నటుడిగా రెండూ దశాబ్దాలు పూర్తి చేసుకున్న నితిన్.. మాటలు రాలేదంటూ ఎమోషనల్ పోస్ట్!

జయం సినిమా ద్వారా నితిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టాడు. ఆ సినిమా సూపర్ డుపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా తర్వాత నితిన్ ధైర్యం,దిల్, వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. కొంతకాలం వరుస ప్లాపులను ఎదుర్కొన్న నితిన్ కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. తర్వాత ఇష్క్ సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత నితిన్ నటించిన గుండెజారి గల్లంతయింది, అఆ, భీష్మ, మాస్ట్రో వంటి సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. ఇటీవల నటించిన చెక్, రంగ్ దే సినిమాలు కొంతవరకు నిరాశపరిచాయి.

ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్నాడు. పొలిటికల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నితిన్ రాజకీయనాయకుడు కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధిన షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జూలై 8 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉండగా నితిన్ తాజాగా సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. నితిన్ హీరోగా తన కెరియర్ ప్రారంభించి ఇప్పటికి రెండు దశాబ్దాలు గడిచింది. ఈ క్రమంలో నితిన్ తాజాగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

ఈ పోస్టులో నితిన్ తన మనసులో ఉన్న మాటలను చాలా ఎమోషనల్ గా రాసుకోచ్చాడు. ” జయం సినిమా ద్వారా 20 సంవత్సరాల క్రితం హీరోగా నా సినీ ప్రయాణం మొదలు పెట్టాను. ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావటం లేదు. జయం సినిమాకు హీరోగా నన్ను నమ్మి వెండితెరకు పరిచయం చేసిన డైరెక్టర్ తేజ గారికి నా కృతజ్ఞతలు. నేను పనిచేసిన సినిమాలలో నాకూ తోడుగా ఉన్న నటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్ అందరికీ చాలా థాంక్స్. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా నన్ను ఎంతో అభిమానిస్తున్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ చాలా ఎమోషనల్ గా రాసుకొచ్చాడు. ప్రస్తుతం నితిన్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.