జనాలను పిచ్చోళ్లను చేయకండి.. మల్లెమాల పై భారీ ట్రోల్స్!

బుల్లితెరపై ఈటీవీలో ప్రసారమయ్యే కార్యక్రమాలను మల్లెమాల వారు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ, జబర్దస్త్ వంటి కార్యక్రమాలు కొన్ని సంవత్సరాల నుంచి మల్లెమాల వారు నిర్వహిస్తూ మంచి ఆదరణ సంపాదించుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో మల్లెమాల వారి నిర్వాకం వల్ల పెద్ద ఎత్తున నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే వీరు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ప్రోమోలను ఓ రేంజ్లో హైలెట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఇమ్మానియేల్ పూర్ణను తాకడంతో ఆమె ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. ఇక చివరికి రష్మీ కళ్ళు తిరిగి కింద పడి పోతారు.దీంతో అసలు ఏం జరిగిందా అని ప్రేక్షకులకు ఎంతో ఆతృతగా కార్యక్రమం వచ్చే వరకు వేచి చూడాలి. ఈ క్రమంలోనే ఈ ప్రోమో పై తాజాగా నెటిజన్లు పెద్ద ఎత్తున మల్లెమాల వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ప్రోమోలు కట్ చేసి ప్రేక్షకులను ఎన్ని రోజులు పిచ్చోళ్లను చేస్తారు.. ఇలాంటివి చూసి చూసి అలసి పోయాము. వీరి అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ లకు ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువేం కాదు.ఇలాంటివి చూసి చూసి బోర్ కొట్టింది ఇకపై ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే మంచిది అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు మల్లెమాల వారిపై ట్రోలింగ్ చేస్తున్నారు.