ప్రోమో చూసి విరుచుకుపడుతున్న నెటిజన్లు.. ఇవే తగ్గించుకుంటే మంచిదంటూ కామెంట్స్!

ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయటానికి బుల్లితెర మీద ఎన్నో కామెడీ షోలు ప్రసారమవుతున్నాయి. అటువంటి కామెడీ షోలో శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఒకటి. గత కొన్ని రోజులుగా ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఈ షోలో జబర్దస్త్ కమెడియన్ లతోపాటు పలువురు టీవీ ఆర్టిస్టులు కూడా సందడి చేస్తున్నారు. సాధారణంగా ఇటువంటి షోలు ప్రేక్షకుల ఆదరణ పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. ఎన్నో ఎమోషన్లతో షోలను హిట్ చేసుకుంటారు. కొందరు కంటతడి పెట్టడం, మరికొందరు కోపంతో ఉండటం వల్ల షో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు.

కానీ షో రేటింగ్స్ కోసం ప్రోమోలను విడుదల చేస్తున్నారు. కొన్ని ప్రోమోలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. టెక్నాలజీ అభివృద్ది కాకముందు ఇలాంటి ప్రోమోలను ప్రేక్షకులు బాగా నమ్మేవారు. కానీ ఇప్పుడు ప్రేక్షకులకు కూడా ఈ ప్రోమో ల గురించి తెలిసిపోయింది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమోలో ఇమన్యూయల్ పూర్ణని ముట్టుకున్నాడు. దీంతో పూర్ణ కొంచం సీరియస్ అయ్యింది .

నన్ను ముట్టుకోవటానికి నీకు ఎంత ధైర్యం . ఆఫ్ట్రాల్ కమెడియన్ ఒక హీరోయిన్ ని ముట్టుకోవటంతో పూర్ణ సీరియస్ అయ్యి స్టేజి దిగి వెళ్ళిపోతుంది. వారిద్దరి మధ్య జరిగిన సంఘటన కారణంగా రష్మి కంగారు పడి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇదంతా కేవలం ప్రోమో కోసమే చేశారు. ఈ విషయం గ్రహించిన నెటిజన్లు మల్లెమాల వారి మీద ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అన్ని తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ విరుచుకుపడుతున్నారు.