పెళ్లి తర్వాత కూడా తన తీరు మార్చుకోని నయన్..ఇలా అయితే ఎలా..?

లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ లేడి సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలను పోషించిన నయనతార ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో మాత్రమే నటిస్తోంది. ఇటీవల నయనతార తను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. నయనతార గత కొన్ని సంవత్సరాలుగా తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరు పెద్దల అంగీకారంతో వివాహబంధం తో ఒక్కటయ్యారు.

ఇటీవల మహాబలిపురం లో సినీ ప్రముఖులు, బందు మిత్రుల మధ్య నయన్, విఘ్నేష్ పెళ్లి చాలా ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కూడా హాజరయ్యారు. అయితే వివాహం జరిన తర్వాతి రోజే ఈ జంట వివాదం లో నిలిచారు. నయనతార తిరుమల దేవస్థానంలో చెప్పులు వేసుకుని తిరిగినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తర్వత తన పెళ్ళి వేడుకను 25 కోట్లకు అమ్ముకొని మరొకసారి వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం నయనతార గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెళ్ళికి ముందు వరుస సినిమాలు చేస్తూ నిత్యం బిజీగా ఉండే నయనతార పెళ్ళి తర్వత కూడా సినిమాలతో బిజీగా ఉంది. పెళ్ళికి ముందు సైన్ చేసిన సినిమాలు అన్నీ ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నాయి. అందువల్ల నయనతార పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా కుటుంబం తో కలిసి గడపడానికి కూడా సమయం లేకుండా పోతోంది . నయనతార ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు వైవాహిక జీవితం బ్యాలన్స్ చేయాలని చూస్తోందని సమచారం. ఇటు నయనతార భర్త విఘ్నేష్ శివన్ కూడా సినిమాలతో బిజీగా ఉన్నాడు. పెళ్ళి జరిగి కొంతకాలం కూడా గడవకుండానే వీరిద్దరు వారి పనుల్లో బిజీ అయిపోయారు. మరీ వీరిద్దరు ఒకరితో ఒకరు ఎప్పుడు గడుపుతారో మారి.