Sai Pallavi: పునర్జన్మలపై నమ్మకం ఉందంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి!

Sai Pallavi: సాయి పల్లవి నాచురల్ స్టార్ నాని కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా పునర్జన్మ, బెంగాల్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే చిత్రబృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి ఈ సినిమా గురించి అలాగే పునర్జన్మల గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఈ సినిమా పునర్జన్మల కథాంశంతో తెరకెక్కింది. మీరు అలాంటి వాటిని నమ్ముతారా అనే ప్రశ్న ఎదురవడంతో సాయిపల్లవి షాకింగ్ సమాధానం చెప్పింది. తాను ఇలాంటి పునర్జన్మ లను నమ్ముతానని చెప్పడమే కాకుండా వాటికి వివరణ కూడా ఇచ్చింది. సాయి పల్లవి చిన్నప్పటి తరగతులలో ఎక్కువగా ఈజిప్ట్‌ యువరాణులు, క్వీన్‌ నెఫెర్టిటి గురించి ఎక్కువగా చదివాను. ఇలా వీటిని ఎక్కువగా చదవడం వల్ల అప్పుడప్పుడు గత జన్మలో నేను కూడా ఒక యువరాణి అయ్యి ఉంటా అనే అనుభూతి కలుగుతుందని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.

ఇలా పూర్వజన్మల గురించి సాయి పల్లవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా రెండు విభిన్న కార్యక్రమాలలో జరుగుతుందని, ఒకటి కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో,మరొకటి హైదరాబాద్‌లో ఉంటుంది. ‘నేను 1960 కోల్‌కతా నేపథ్యంలో జరిగే కథలో దేవదాసి పాత్రను పోషించాననిఈ పాత్రలో నటించడం నిజంగా తనకు ఒక గొప్ప అనుభూతి అని ఈ సందర్భంగా సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ చిత్రం గురించి ఎన్నో విషయాలు వెల్లడించారు.