ఒక సంస్థ గురించి ఆర్పీ అలా మాట్లాడటం తప్పు.. నిర్మాత కామెంట్స్ వైరల్?

జబర్దస్త్ కార్యక్రమంలో తలెత్తిన వివాదం రోజు రోజుకు ముదురుతుంది. బ్రతకడం భారమైన ఎంతో మందికి ఈ కార్యక్రమం అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిందని చెప్పాలి.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇలాంటి వారిలో కమెడియన్ కిరాక్ ఆర్పి ఒకరు.జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆర్పి ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ నిర్వాహకులపై శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి ఈయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణం అవుతున్నాయి.

ఇకపోతే శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి ఆర్పి చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ కావడంతో ఎంతో మంది జబర్దస్త్ కమెడియన్స్ ఈ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. ఇకపోతే తాజాగా నిర్మాత నట్టి కుమార్ ఈ వ్యాఖ్యలపై స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరాక్ ఆర్పి ప్రస్తుతం శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నప్పుడు చేసి ఉంటే ఎవరైనా నమ్మే వాళ్ళు. మల్లెమాల వంటి పెద్ద సంస్థలో మంచి పేరు సంపాదించుకొని బయటకు వచ్చిన తర్వాత ఆర్పీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు.

శ్యాం ప్రసాద్ రెడ్డి గారు చాలా వరకు కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. అలాంటి ఆయన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరు కూడా నమ్మరు. ఇకపోతే మల్లెమాల వంటి పెద్ద సంస్థ గురించి ఆర్పి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఫుడ్ బాగోలేదని చెప్పడం భావ్యం కాదు.ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి తనకు సహాయం చేయాలని నాగబాబు సహాయం చేస్తారనడం కరెక్ట్ కాదు.నాగబాబు దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే అతను అందరికీ సహాయం చేస్తారు అలాగని శ్యాంప్రసాద్ రెడ్డి సహాయం చేయాలని రూలేమీ లేదు. ఆయన నీకు కరెక్ట్ టైంకి జీతం ఇవ్వకపోతే నువ్వు మాట్లాడాలి కానీ ఇలా లేనిపోని ఆరోపణలు చేయడం భావ్యం కాదంటూ నిర్మాత నట్టి కుమార్ ఈ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు.