సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఛలో సినిమా ద్వారా రష్మిక టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి హిట్ సినిమాలలో నటించింది. ఇటీవల విడుదలైన పుష్ప సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇలా పుష్ప సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మిక బాలీవుడ్ లో కూడా వరుస సినిమా ఆఫర్లు అందుకుంటోంది.
తెలుగు, తమిళ, కన్నడ, భాషల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక హిందిలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యింది. హిందీలో సిద్ధార్ధ్ మల్హొత్రా హీరోగా నటిస్తోన్న మిస్టర్ మజ్ను సినిమాతో రష్మీక బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. పాకిస్థాన్ నేపథ్యంలోసాగే ఈ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా కి జోడిగా రష్మీకి నటించనుంది . త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.అంతేకాకుండా ఈ అమ్మడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న `గుడ్ బై`మూవీలో నటించే అవకాశం అందుకుంది.
ఈ క్రమంలో రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న యానిమల్ మూవీలోనూ రష్మిక ఎంపిక అయ్యిందని సమాచారం.వీటితో పాటు బాలీవుడ్ లో రష్మీక ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను దక్కించుకుందని తెలుస్తొంది టైగర్ ష్రాఫ్ హీరోగా శశాంక్ ఖేతాన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. ఇలా పుష్ప సినిమా ద్వారా బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో అవకాశాలు దక్కించుకొని రష్మీక అందరిని ఆశ్చర్యపరుస్తోంది. తెలుగులో ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తోంది.
