Nani : బిగ్ న్యూస్ : మరోసారి నాని సంచలన కామెంట్స్ వైరల్.!

Nani : నాచురల్ స్టార్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “శ్యామ్ సింగ రాయ్” ఈ వారంలో విడుదల అవుతున్న మరో పెద్ద సినిమా అని తెలిసిందే. దర్శకుడు రాహుల్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా నాని కెరీర్ లోనే అత్యంత అధిక బడ్జెట్ తో అధిక అంచనాలతో రిలీజ్ అవ్వబోతుంది. అయితే తన లాస్ట్ సినిమా “టక్ జగదీష్” నేరుగా ఓటిటి లో రిలీజ్ కావడం తనపై పెద్ద ప్రభావాన్నే తీసుకొచ్చింది.

అయితే ఆ సినిమా ఓటిటి కి వెళ్ళడానికి ఏపీలో ఉన్న టికెట్ ధరలు అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఏదైతే అది అయ్యిందని ఈసారి థియేట్రికల్ రిలీజ్ కే నాని వస్తున్నాడు. మరి ఆ సమయంలో నాని చేసిన పలు కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు కూడా నాని నిర్మొహమాటంగా చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్ కాదని, హీరోలు, సినిమాలు పాలిటిక్స్ అనేవి పక్కన పెడితే ఓ రకంగా ఆడియెన్స్ ని అవమానించినట్టుగా అక్కడ జరుగుతుంది అని తెలిపాడు. ఏపీలో టికెట్ ధరలు ఒకలా ఉండి తెలంగాణాలో ఒకలా ఉంటే తక్కువ చేసినట్టుగా ఉంటుందని.

అంటే ఇప్పుడు ఒక స్కూల్ లో పిక్నిక్ వెళ్లాలని ప్లాన్ చేస్తే అందరికీ ఒక ధర పెట్టి ఒకరికి మాత్రం నువ్ డబ్బులు ఇవ్వలేవు నువ్ పది రూపాయలు మాత్రమే ఇవ్వు అని చెప్తే ఎలా ఉంటుంది? అందరి ముందు అవమానించినట్టు కాదా అని అన్నాడు. దీనితో మళ్ళీ నాని కామెంట్స్ సంచనం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ తో నాని మరోసారి తన గట్స్ ఏమిటో ప్రూవ్ చేసుకున్నాడని మరికొందరు అతడికి సపోర్ట్ చేస్తున్నారు.