హోటల్ గదిలో మహిళ నగ్న శవం.. పోలీసు విచారణలో బయట పడిన నిజాలు?

ఉత్తరప్రదేశ్లో గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ మహిళ హత్య కేసు ఒక మిస్టరీగా మారింది. ఈ క్రమంలోనే పోలీసులు ఈ కేసును ఛేదించడం కోసం అహర్నిశలు శ్రమించి ఎట్టకేలకు ఈ కేసును విజయవంతంగా పూర్తి చేశారు.గత నెలలో జరిగిన ఈ హత్య కేసులో భాగంగా ఒక మహిళ మృతదేహం లాడ్జిలో నగ్నంగా ఉండడమే కాకుండా ఆమె తల మొండెం వేరు వేరు భాగాలలో ఉండటంతో పోలీసులు ఈ కేసును ఛేదించడానికి కష్టతరంగా మారినప్పటికీ పలు ఆధారాలు సేకరించి ఈ కేసును ఛేదించారు.చివరికి అనుమానం అనే ఒక జబ్బుతో తన భర్త ఈ విధమైనటువంటి దారుణానికి ఒడిగట్టారని పోలీసులు విచారణలో తేటతెల్లమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

పన్వేల్ కి చెందిన పూనమ్ అనే మహిళ స్థానిక ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుండేది. ఆమెకు రామ్ సులోచన పాల్ అనే వ్యక్తితో గత ఏడాది వివాహం జరిగింది. కొద్ది రోజులపాటు వీరి జీవితం ఎంతో సుఖంగా సంతోషంగా సాగిపోయినప్పటికీ రామ్ సులోచన పాల్ మనసులో అనుమానం అనే ఒక బీజం మొలకెత్తింది. దీంతో తన భార్య కాస్త నవ్వుతూ మాట్లాడిన ఎంతో అనుమానపడే వారు.ఈ క్రమంలోనే ఈ పథకం ప్రకారం తన భార్యను లాడ్జ్ కి తీసుకెళ్ళి అక్కడ ఆమెను దారుణంగా హతమార్చి పోలీసులకు గుర్తు తెలియకుండా తల, టాటూ ఉన్న చేతిని నరికి మరొక ప్రదేశంలో పడేశారు.

ఈ కేసులో పోలీసులకు ఒక్క అనుమానం రాకుండా ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసిన రామ్ సులోచన పాల్ లాడ్జి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఒక హ్యాండ్ బ్యాగ్ లభ్యమైంది అందులో పూనమ్ కి సంబంధించిన వివరాలు ఉండడంతో పోలీసులు లాడ్జ్ లో చనిపోయిన మహిళ తన ఒకటేనని గ్రహించి పరారీలో ఉన్న తన భర్తను పట్టుకుని విచారించగా అసలు బాగోతం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని తనని కస్టడీలోకి తీసుకున్నారు.