చంద్రబాబు ABCD విమర్శలకు విజయసాయి కౌంటర్ !

ap bjp targets ycp mp vijayasai reddy

గ్రేటర్ విశాఖ మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ దూకుడు పెంచింది. ముఖ్యంగా పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను విజయసాయి రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు. వార్డు వార్డు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. ఓ వైపు వైసీపీ గెలిస్తే విశాఖకు ఏం చేస్తుందో చెబుతూ.. చంద్రబాబు, లోకేష్ విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నారు. అలాగే ఎవరెన్ని కుట్రలు చేసినా పరిపాలనా రాజధాని విశాఖకు వచ్చి తీరుతుందని మరో సారి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటంలో వైసీపీ ముందు ఉంటుందన్నారు.

AP Municipal Elections: చంద్రబాబు ఏబీసీడీ విమర్శలకు విజయసాయి కౌంటర్.. కొత్త అర్థం చెప్పిన ఎంపీ

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటు లోపలా, బయటా వైయస్ఆర్ కాంగ్రెస్ పోరాడుతోందని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి సూచించారన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలోనూ తీర్మానం చేస్తామన్నారు. బాధ్యత లేని నాయకులు విశాఖలో పర్యటిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారని మండిపడ్డారు. సింహం కడుపున పిల్లి పుట్టదని.. సింహమే పుడుతుందని జగన్ గురించి చెప్పారు. అలాగే చంద్రబాబు గుణగణాలను పుణికి పుచ్చుకున్న వ్యక్తి లోకేష్ అని ఆరోపించారు. కపటం, కుట్రలు, కుతంత్రాలు.. వెన్నుపోట్లు.. ఇదే చంద్రబాబు జీవితమన్నారు. చంద్రబాబుకు ఎక్కడా నిజాయితీ లేదన్నారు.

చంద్రబాబు డిక్షనరీ ప్రకారం ఏబీసీడీ.. అంటే, ఆల్ బేవర్స్ అండ్ చీటర్స్ డెకాయిట్స్ పార్టీ తెలుగుదేశం అని కొత్తం అర్థం చెప్పారు. గురువారం కర్నూలులో చంద్రబాబు చేసిన ఏబీసీడీ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఈ పురపాలక ఎన్నికలతో టీడీపీ కథ ముగిసిపోనుందన్నారు. చంద్రబాబు సినిమాకు స్థానిక సంస్థల ఎన్నికలతో ప్రజలు ముగింపు పలకబోతున్నారన్నారు. విశాఖకు, ఉత్తరాంధ్రకు మంచి జరుగుతుంటే.. విశాఖను కార్య నిర్వాహక రాజధానిగా ముఖ్యమంత్రి శ్రీ జగన్ ప్రకటిస్తే.. చంద్రబాబు అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అలాంటి ఉత్తరాంద్ర ద్రోహులను ఇక్కడి ప్రజలు అడుగు పెట్టనివ్వకూడదన్నారు. ఆలస్యమైనా కాని.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకు వచ్చి తీరుతుందన్నారు.