బాబు హయాంలో నేరాలెక్కువ.. జగన్ పాలనలో 18 శాతం తగ్గాయట..!

mp vijaya sai reddy praises cm jagan

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. విజయసాయిరెడ్డి.. ఎక్కువగా ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారని తెలుసు. ట్విట్టర్ లో ఏదో ఒక ట్వీట్ చేస్తూ ఆయన ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చకు దారి తీస్తుంటారు.

mp vijaya sai reddy praises cm jagan
mp vijaya sai reddy praises cm jagan

తాజాగా.. విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. వైఎస్సార్సీపీ పార్టీ గెలిస్తే అరాచకమే అంటూ శోకాలు పెట్టారు కదా.. వాళ్లంతా ఏమయ్యారు? చంద్రబాబు హయాంలో కంటే 18 శాతం నేరాలు తగ్గినట్టు క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడించిందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

కుల, మత, ఘర్షణలు రెచ్చగొట్టే కుట్రలు జరిగినా ప్రజలు పట్టించుకోలేదని.. యువ సీఎం పాలనకు ఇంతకంటే ప్రశంసలు ఏం కావాలని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

అయితే.. ఆ ట్వీట్ పై నెటిజన్లు నెగెటివ్ గా స్పందిస్తున్నారు. అయ్యా.. ఈ సంవత్సరం నేరాలు జరిగేంత సమయం కూడా ఉందా? ఓవైపు కరోనాతో ఇంటి నుంచి బయటికే వెళ్లలేక జీవితాలే ఆగిపోతే.. నువ్వు నేరాలు తగ్గాయంటూ ట్వీట్లు ఏంది? ఏపీ ప్రభుత్వానికి ప్రశంసలు ఏంది? మీరూ మీ దొంగ లెక్కలు.. అసలు దొంగలే వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు… అంటూ నెటిజన్లు విజయసాయిరెడ్డి ట్వీట్ కు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు.