Samantha: ఆ రోగాలతో అస్పత్రిపాలైన సినీ నటి సమంత.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?

samantha:టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఎంతో బిజీగా గడుపుతున్న సమంత ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల నుంచి సమంత వరుస ప్రయాణాలు చేయడంతో ఈమె తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం.ఈ క్రమంలోనే సమంత నిన్న కడపలో ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి వెంటనే తిరుపతికి శ్రీవారిని దర్శనార్థం బయల్దేరారు.

ఈరోజు ఉదయం తిరుమల చేరుకున్న సమంత శ్రీవారిని దర్శించుకున్న అనంతరం శ్రీ కాళహస్తికి వెళ్లి అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు.ఇలా హైదరాబాద్ వెళ్ళిన ఆమె తీవ్రమైన జలుబు జ్వరంతో బాధ పడినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే అస్వస్థతకు గురైన సమంత ముందుగానే వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారు.ఇలా ఆస్పత్రికి వెళ్లిన ఆమెకు వైద్యులు పరీక్షలు చేసి ఎలాంటి ప్రమాదం లేదని తెలపగా తిరిగి ఇంటికి వెళ్లారు.

ఒక్క సారిగా సమంత అనారోగ్యం పాలైందని తెలియడంతో ఆందోళన చెందిన అభిమానులు ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెండు రోజుల పాటు నిరంతరంగా ప్రయాణాలు చేయటం వల్ల ఆమె అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఓమి క్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నడంతో సమంత ముందస్తు జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు చేయించుకుంది.