Crime: ఇద్దరు బిడ్డలను చంపి అనంతరం తల్లి ఆత్మహత్య.. ఎక్కడో తెలుసా.?

Crime: శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మెట్ట పేట గ్రామానికి చెందిన జనార్దన్ రావు కూతురు అత్త కూతురు అనూష తో ఆరేళ్ళ క్రితం వివాహమైంది. జనార్ధన్ అచ్చుతాపురం లోని ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అనకాపల్లి ఉమ్మలాడ రోడ్డు లోని ఒక ఇంట్లో ఏడు నెలలుగా అద్దెకు ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. జనార్ధన రావు ఉద్యోగానికి సెలవు పెట్టి తాజాగా తన స్వగ్రామం మెట్ట పేట కు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో భార్య అనూష ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉంది. ఇద్దరు కూతుర్లు కింద పడి ఉన్నారు. ఇక వెంటనే జనార్ధన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇద్దరు కూతుళ్లను చున్నీతో ఉరివేసి వారు చనిపోయిన తర్వాత అనూష కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ విషయంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. సంఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్ ను సేకరించారు. ఆ సూసైడ్ నోట్ ప్రకారం మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు వివాహిత ఆత్మహత్య వెనుక ఇంటి యజమాని పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు