కార్తీక దీపం సెట్ లో సందడి చేసిన మోనిత..మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనుందా..?

బుల్లితెర మీద ప్రసారమైన టీవీ సీరియల్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న సీరియల్ కార్తీకదీపం. గత కొన్ని సంవత్సరాలుగా మా టీవీలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టీవీ సీరియల్ లోని డాక్టర్ బాబు దీప మోనిత క్యారెక్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి . అయితే ప్రస్తుతం ఈ సీరియల్లో కొత్త జనరేషన్ అంటూ కొత్త క్యారెక్టర్లను తెచ్చిపెట్టారు. అయినప్పటికీ ఈ సీరియల్ మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది. అయితే ఈ సీరియల్ లో కార్తీక్, దీప, మోనిత పాత్రలు ఉంటే ఇంకా బాగుండేదని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ కార్తీక్ దీప పాత్రలు చనిపోవడం వల్ల వారిని తిరిగి తెచ్చే అవకాశం లేదు.

ఇక మోనిత విషయానికి వస్తే.. మోనితా ఈ సీరియల్లో తిరిగి నటించాలంటే చిన్న వయస్సులోనే జుట్టుకు రంగేసుకుని పెద్ద దానిలా నటించాల్సి వస్తుంది. అందువల్ల మోనిత కూడా ఈ సీరియల్ లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు టచ్ లో ఉండే మోనిత అలియాస్ శోభా శెట్టి తాజాగా కార్తీకదీపం సెట్లో సందడి చేసింది. సెట్ లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చి అక్కడున్న వారిని సర్ప్రైజ్ చేసింది. కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్ తో పాటు హిమ, శౌర్య, ప్రేమ్, సౌందర్య గారితో మాట్లాడుతూ సందడి చేసింది.

ఈ సందర్భంగా ప్రేమ్ మాట్లాడుతూ మా అత్త గారు అని అంటాడు . దీంతో మోనితా మాట్లాడుతూ అసలు నేను కొంచమైనా అత్తగారిలా కనిపిస్తున్నానా అంటుంది. మీతో అత్తా అని పిలిపించుకోవటం ఇష్టం లేక ఈ సీరియల్ నుండి వెళ్ళిపోయాను అంటుంది. అప్పుడు మీరూ స్టైలిష్ అత్తగారు అని ప్రేమ్ అంటాడు. తర్వత సౌందర్యంతో కలిసి కాసేపు కన్నడ భాషలో కబుర్లు చెప్పుకుంది. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ లో మొత్తం కన్నడ వాళ్ళు ఉన్నారు. అప్పుడు వీళ్ళందరూ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్ని… అంటూ మోనిత చెప్పుకొచ్చింది. మొత్తానికి మోనిత కార్తీక దీపం సీరియల్ లో రీ ఎంట్రీ గురించి ప్రేక్షకులకి క్లారిటీ ఇచ్చింది.