భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిలిచారు. 78.1 శాతం ప్రజామోదంతో మోదీ తర్వాత స్థానంలో నిలవడం వివేషం. ఇక దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రుల పనితీరు, సంక్షేమం, అభివృద్ధి, ప్రజాభిమానం చూరగొనడంలో సీఎం జగన్ టాప్ 5 లో నాల్గవ స్థానంలో నిలిచారు. 2019 సార్వత్రిక ఎన్నికలు అనంతరం గడిచిన ఏడాది కాలంగా దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన ముఖ్యమంత్రుల పనితీరుపై సీ ఓటరు అనే సర్వే సంస్థ ఇటీవలే సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఫలితాల్ని తాజాగా వెల్లడించడంతో జగన్ స్టానం ప్రజల దృష్టిలో ఎలా ఉందన్నది తేటతెల్లమైంది.
మోదీ తర్వాత స్థానంలో నిలవడం..ముఖ్యమంత్రుల పనితీరులో నాల్గవ స్థానంలో నిలవడంతో జగన్ కున్న క్రేజ్ మరోసారి బయట పడింది. గతంలో ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసుగా మూడు సార్లు విజయం సాధించి దేశంలోనే తిరుగులేని సీఎంగా కితాబు అందుకున్నారు. మరోవైపు భాజాపా అదిష్టానం వద్ద కూడా బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఇక అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో నిలవగా, చత్తీస్ ఘడ్, కేరళ ముఖ్యమంత్రులు భూపేష్ వాఘేలా, పినరయి విజయన్ లు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
నాల్గవ స్థానంలో జగన్ నిలవగా, ఐదవ స్థానంలో మహరాష్ర్ట ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.సీ ఓటర్ సర్వే సంస్థ గడిచిన ఆరు సంవత్సరాల ముఖ్యమంత్రుల పనితీరుపై సర్వే నిర్వహించినప్పటికీ ఏపీ విషయంలో మాత్రం గడిచిన ఏడాది కాలంగా సీఎం జగన్ పనితీరుపై సమగ్ర సర్వే నిర్వహిచింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులు తీసుకుంటున్న నిర్ణయాలకు భిన్నంగా జగన్ ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా శర వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఏడాది కాలంలో సరికొత్త రికార్డు సృష్టించినట్లు సీ ఓటర్ పేర్కొంది. అలాగే ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడంలోనే ఎన్నికల హామీకి సంబంధం లేకుండా కొత్త పథకాలను తెరపైకి తెచ్చి పేద ప్రజలకు ఫలాలు అందించడంలో జగన్ ముందున్నట్లు సదరు సంస్థ పేర్కొంది.
