Duvvada: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఈయనపై ఇటీవల పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది అయితే ఈయన గురించి ఏ విధమైనటువంటి ఆరోపణలు లేకుండా ఒక్కసారిగా సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అయితే ఈ సస్పెన్షన్ పై దువ్వాడ శ్రీనివాస్ స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వానికి దూరంగా ఉంటూ మరొక మహిళ దివ్వల మాధురితో సన్నిహితంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయం కాస్త బయటకు రావడంతో ఈయన గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఈయనని పార్టీకి దూరం పెడతారని అందరూ భావించారు కానీ అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని రాజకీయాలకు సంబంధించింది కాదని జగన్ భావించారు.
ఇలా దువ్వాడ శ్రీనివాస్ గురించి పెద్దగా జగన్ పట్టించుకోలేదు కానీ ఉన్నఫలంగా ఈయనపై సస్పెన్షన్ వేటు వేయటంతో అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా తన సస్పెన్షన్ పై దువ్వాడ శ్రీనివాస్ ఒక వీడియో విడుదల చేశారు ఈ వీడియోలో ఈయన మాట్లాడుతూ…నాకు ఈ స్థాయిని, హోదాను, ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ కోసం నేను ఎంతో కష్టపడి పనిచేశాను. గోంతై మాట్లాడాను. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసిన నన్ను అకారణంగా.. వ్యక్తి గత కారణాలు అనే కారణంతో నన్ను సస్పెండ్ చేశారని తెలిసింది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి తో కలిసి నేను వేసిన అడుగులు జగన్మోహన్ రెడ్డితో కలిసి నడుస్తున్న నేను నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ చిరస్మరణీయం. కేవలం రాజకీయ క్రీడలలో నేను బాలయ్యానని నాకు అనిపిస్తుంది.నేటికి 25 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్న నేను.. ప్రజాసేవనే పరమావదిగా భావించిన నేను.. ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు. అవినీతి చేయలేదు. లంచాలు తీసుకోలేదు. అధికార దుర్వినియోగం చేయలేదు. భూ కబ్జాలు కూడా చేయలేదు కేవలం పార్టీ కోసమే నిరంతరం కష్టపడి పని చేశానని తెలిపారు. ఇక పార్టీ నన్ను సస్పెన్షన్ చేసిన ప్రజల కోసమే నేను పని చేస్తానని ప్రజల కోసమే పోరాటం చేస్తాను అంటూ దువ్వాడ శ్రీనివాస్ వీడియో విడుదల చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.