కారు ప్రమాదంలో ఎమ్మెల్యే కుమారుడికి గాయాలు..

తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముమ్మడివరం శాసనసభ సభ్యుడు పొన్నాడ సతీశ్‌ కుమారుడుతో పాటు ఆయన మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ నుంచి అమలాపురం వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.