జేపీ నడ్డా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి ఆర్ కే రోజా..

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ జేపీ నడ్డా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అవగాహన లేకుండా మాట్లాడారు అంటూ.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో 95 శాతం పూర్తి చేశారు అని.. అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏపీ లోని ఎక్కడ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు అని.. బీజేపీ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు.

అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలన్ని కలిపి వచ్చాయా.. కేంద్రం అప్పులు చేయడం లేదా.. ఆ పార్టీ సీఎంలు అప్పులు చేయడం లేదా అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను కూడా మధ్యలో లాగుతూ.. వారి వల్లే ఏపీకి అన్యాయం జరిగింది అని.. ఇక బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికలు తెలుసుకోవాలి అని గట్టిగా మాట్లాడారు.