RRR: ఆర్ఆర్ఆర్ సినిమాపై కీలక ప్రకటన చేసిన మంత్రి పేర్ని నాని!

RRR: పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మొత్తానికి ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని ఈ సినిమాపై ఒక కీలక ప్రకటన చేశాడు. ఇటీవలే ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత డివివి దానయ్య సినిమా టికెట్ల రేట్లు పెంపు విషయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా టికెట్ల రేట్లు పెంపుపై పేర్ని నాని కూడా స్పందించాడు. ఈ సినిమా టికెట్ల రేట్ల విషయంలో డైరెక్టర్, నిర్మాత జగన్ ను కలిశారని.. ఇక ఈ సినీ నిర్మాతలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేశారని అన్నాడు. త్వరలోనే జగన్ సంతకం కూడా పెట్టానున్నాడని.. పారితోషికం విషయంలో కాకుండా కేవలం నిర్మాణానికి 100 కోట్లు బడ్జెట్ పెడితే.. సినిమా విడుదలైన పది రోజులు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తామని అన్నాడు. ఇక ప్రజలకు భారం కాకుండా సినిమాని ఇష్టంగా చూసేలా చేయాలని.. ఆన్లైన్ టికెట్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని అన్నాడు.