టీడీపీ ఆరిపోయే దీపం లాంటిదంటున్న మంత్రి జోగి రమేష్..

తాజాగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఈరోజు ఏఎస్ పేట ఎన్నికల ప్రచార భాగంలో పాల్గొన్నారు. ఇక ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇక తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేశారు. వైయస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదిగిందని అన్నారు.

తెలుగుదేశం పార్టీ మాత్రం ఆరిపోయే దీపం లాంటిది అని విమర్శలు చేశారు. ఆత్మకూరు పరిస్థితి బద్వేల్ తరహాగా ఉందని.. పోలింగ్ శాతం పెంచేందుకు కచ్చితంగా కృషి చేయాలి అని అన్నారు. పోటీ నుంచి తప్పుకున్న లోపాయికారి కి మద్దతు ఇవ్వడం టీడీపీ అలవాటు అని అన్నారు.