Chandra Babu: సంబరాలు జరుపుకున్న మంత్రి.. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత పై సమాధానం ఏంటి: చంద్రబాబు నాయుడు

Chandra Babu: తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి ఉష శ్రీ చరణ్ ర్యాలీ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్కడ తీవ్రమైన ట్రాఫిక్ ఏర్పడటంతో చాలా మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ఒక పసిపాప మృతి కారణమయ్యారు. దీంతో తాజాగా చంద్రబాబు ఆ విషయంపై ఫైర్ అయ్యాడు. ర్యాలీ సమయంలో.. తమ కూతురి పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఆ తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుపడ్డారు.

దీంతో ఆ పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక చంద్రబాబు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. చిన్నారి ఆసుపత్రికి వెళ్ళడం కంటే మంత్రుల ర్యాలీలు ముఖ్యమా అని ప్రశ్నించాడు. అర్థంలేని ఆంక్షలతో చిన్నారి మృతికి కారణమైన పోలీసులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నించాడు. సంబరాలు జరుపుకున్న మంత్రి.. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత పై సమాధానం ఏంటి అని గట్టిగా ఫైర్ అయ్యాడు.