ఆపాట నాదికాదంటూ సుమకి పంచ్ వేసిన మిల్కీ బ్యూటీ..!

బుల్లితెర మీద యాంకర్ గా వ్యవహరిస్తున్న సుమ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా తన యాంకరింగ్ తో బుల్లితెర మీద సందడి చేస్తున్న సుమ ఒకవైపు ఎన్నో టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ మరొక వైపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లతో నిత్యం బిజీగా ఉంటుంది. ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షో కి సుమ గత కొన్ని సంవత్సరాలుగా యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ షో లో ఎంత మంది సెలబ్రెటీలు పాటిస్పేట్ చేసి సందడి చేస్తుంటారు.

ఇటీవల ఈ షో రెండు వందల ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్పెషల్ ఎఫ్3 సినిమా యూనిట్ గెస్టుగా హాజరయ్యారు. ఈవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈవారం జరగబోయే ఎపిసోడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా, డైరెక్టర్ అనిల్ రావిపూడి,సోనాల్‌ చౌహాన్‌, నటుడు సునీల్ హాజరయ్యారు. క్యాష్ షో లో ఈ నలుగురితో కలిసి సుమ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ షోలో ఒక సందర్భంగా సుమ మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు సినిమాలో మైండ్ బ్లాక్ పాటకి తమన్నా చాలా బాగా డాన్స్ చేసింది అనగానే అందుకు తమన్నా స్పందిస్తూ.. ఆ పాటకు డాన్స్ చేసింది నేను కాదు రాష్మీక అని పంచ్ వేసింది.

ఈ క్యాష్ షో లో సుమ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఓడిపోయిన వారికి సుమ ఫన్నీ టాస్క్ లు ఇస్తూ ఉంటుంది. ఈ ప్రోమోలో భాగంగా చాక్లెట్స్ కోసం చిన్నపిల్లలు తల్లితండ్రులను ఎలా అడుగుతారో తమన్నా, సునీల్ యాక్ట్ చేస్తూ నవ్వులు పూయించారు. ఇటీవల విడుదలైన ప్రమోలో తమన్నా కన్నీళ్ళు పెట్టుకుంది . అయితే తమన్నా అల కన్నీళ్ళు పెట్టుకోవటానికి గల కారణం గురించి మాత్రం ఆ వీడియోలో చూపించలేదు. తమ అభిమాన హీరోయిన్ ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంది అని తమన్నా అభిమానులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాష్ షో లో తమన్నా కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణం గురించి తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.