మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం మరణించారు. జైన్ నాదెళ్ల వయసు 26 సంవత్సరాలు. అతను సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. దీంతో వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.    ఇన్నాళ్లు చిల్డ్రన్స్ హాస్పిటల్ అయిన  సీటెల్ చిల్డ్రన్స్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బ్రెయిన్ రీసెర్చ్‌ లో  చికిత్స పొందుతూ వచ్చారు. సత్య నాదెళ్లకు కుమారుడితోపాటు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.