Mega Star With Super Star : టాలీవుడ్లో మల్టీ స్టారర్ల జోరు మామూలుగా లేదు. పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం సింగిల్ స్క్రీన్పై ఒకేసారి సందడి చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ కోవలోనే మొన్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వచ్చింది. సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ‘ఇప్పుడు ఆచార్య’ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్.
ఇక తదుపరి, విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇలా చెప్పుకుంటూ పోతే, పవర్ స్టార్ కాంబినేషన్లోనూ కొన్ని మల్టీ స్టారర్ సినిమాలు లైన్లో వున్నాయ్. ఈ తరుణంలోనే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ కొత్తగా తెరపైకి వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో రూపొందిన మెగా ప్రాజెక్టు ‘ఆచార్య’లో ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం పంచుకున్నారు. ఈ సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారట. ఇక నెక్స్ట్ మెగాస్టార్తో ఫుల్ లెంగ్త్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనీ తెలుస్తోంది.
కొణిదెల ప్రొడక్షన్స్తో కలిసి, మహేష్ బాబు తన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మించాలనుకుంటున్నారట. చరణ్ కూడా ఇదే ప్లానింగ్లో వున్నాడనీ తెలుస్తోంది. అయితే డైరెక్టర్ ఎవరనే విషయంపై కొంత సందిగ్థత వున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫుల్ డిటెయిల్స్ వెల్లడి కానున్నాయట.
అన్నట్లు ‘ఆచార్య’ సినిమా కోసమే మొదట మహేష్ బాబును అనుకున్నారట. అనుకోకుండా, ఆ ప్రాజెక్టులోకి చరణ్ వచ్చి చేరాడట. ఏది ఏమైతేనేం, తన వాయిస్ ఓవర్తో ఇన్డైరెక్టుగా మహేష్ బాబు కూడా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినట్లే. అన్నీ కుదిరి, త్వరలోనే తెరపై ఈ కాంబినేషన్ సెట్ అయిందంటే, ఇటు మెగా ఫ్యాన్స్కీ, అటు సూపర్ స్టార్ ఫ్యాన్స్కి ఫుల్ పండగే.