ఏపీ యంగ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నింటిని అమలు పరుస్తూ ప్రజలతో జేజేలు కొట్టించుకుంటున్నారు. ఇది బడుగు, బలహీన వర్గాల రాజ్యమని చాటి చెబుతున్నారు. మాట తప్పడు..మడము తిప్పడన్న పదానికి జగనన్న ఓ పర్యాయ పదంలా నిలిచారని అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్త కంఠగా చెబుతున్నారు. ప్రభుత్వం ఫామ్ చేసిన ఆరంభంలో కాస్త తడబడినా ఇప్పుడవన్ని ఒక్కొక్కటిగా లైన్ లోకి వస్తున్నాయి. విమర్శకులు సైతం జగన్ పాలనకు జేజేలు కొడుతున్నారు.
ఇక మూడు రాజధానుల ప్రకటనతో జగన్ అభివృద్ది దిశగా ఎలాంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారు అన్నది స్పష్టంగా అర్ధమవుతోంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా జగన్ సర్కార్ ముందుకు సాగిపోతుంది. తాజాగా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ ప్రభుత్వం పరిశ్రమలకు భరోసాగా నిలుస్తుందన్నారు. మూతపడ్డ పరిశ్రమలను పున ప్రారంభించడంతో పాటు, పన్నులు తగ్గిస్తామన్నారు. విశాఖలో మెగా పరిశ్రమలు వస్తున్నాయన్నారు. 24, 170 కోట్లతో 39 లార్డ్ మెగా పరిశ్రమలు ఏర్పాటు చేసి 33,323 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నమాని తెలిపారు. ముందు ఐదు మెగా పరిశ్రమలు 651 కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు.
అలాగే దివంగత ముఖ్యమంతి ఎన్టీఆర్ బ్రతికుంటే ఆయనలా అన్ని వర్గాల వారి సంక్షేమానికి కృషి చేస్తున్న జగన్ ని చూసి మెచ్చుకునేవారని అన్నారు. మద్యపాన నిషేధంలో ఎన్టీఆర్ తర్వత చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించనున్నారని కొనియాడారు. ఇప్పటికే రాష్ర్టంలో చాలా వరకూ మద్య విక్రయాలు తగ్గయని, మందుబాబులు మందు మానేస్తున్నారు అనడానికి ఇది శుభ సూచిక లాంటిదన్నారు. మద్యం దుకాణాలు ఇప్పటికే బాగా తగ్గించామని…మరికొన్ని నెలల్లో పూర్తిగా మద్యం దొరికే పరిస్థితి ఉండదని ధీమా వ్యక్తం చేసారు.
