Suicide: ప్రేమించి పెళ్లి చేసుకుంది…. వరకట్న వేధింపులు భరించలేక చివరికి ఇలా!

Suicide: ప్రస్తుత కాలంలో దేశంలో ప్రేమ వివాహాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా అతి చిన్న వయసులోనే పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని జీవితాంతం ఎంతో సంతోషంగా ఉండాలని ఆశ పడిన అమ్మాయిలకు నిరాశ ఎదురవుతోంది.ఇటువంటి సంఘటన ఇటీవల నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన దోర్ల ప్రవళిక బోర్గం(పి) గ్రామాని కి చెందిన చామాకూర మహేష్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసి కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించి చాలా ఘనంగా ఐదు సంవత్సరాల క్రితం వీరికి పెళ్ళి జరిపించారు. పెళ్లి సమయంలో ప్రవళిక తండ్రి కట్నంగా 20 లక్షల నగదు బంగారు ఇచ్చారు. కూతురు ప్రేమించినప్పటికీ సాంప్రదాయం ప్రకారం కూతురికి ఇవ్వాల్సిన కట్న కానుకలు లాంఛనాలు ఇచ్చి ఘనంగా పెళ్ళి జరిపించి నప్పటికీ అత్తగారి ఇంటి నుండి అదనపు కట్నం వేధింపులు తప్పలేదు.

తరచూ భార్యాభర్తలిద్దరూ ఈ విషయాన్ని కై గొడవ పడుతూ ఉండేవాడు. వీరి సమస్య పరిష్కారానికి ఎన్నోసార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినప్పటికీ సమస్య మాత్రం తీరలేదు. దీనితో మనస్తాపం చెందిన ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడమే దీనికి పరిష్కారమని భావించి సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.