సింగర్ సునీత మెహందీ, హ‌ల్దీ వేడుక.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఆమె కొడుకు, కూతురు

సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా అల‌రించిన సునీత 42 ఏళ్ళ వ‌య‌స్సులో రెండో పెళ్ళి చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న శ్రీరామచంద్రుని ఆలయంలో బిజినెస్ మ్యాన్ రామ్ వీర‌ప‌నేనితో ఈమె ఏడ‌డుగులు వేయ‌నుండ‌గా, ఈ రోజు ఉద‌యం మెహందీ, హ‌ల్దీ వేడుకలు జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి కేవ‌లం సన్నిహితులు, శ్రేయోభిలాషులు మాత్ర‌మే హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది.ప్ర‌స్తుతం ఈ వేడుక‌ల‌కు సంబంధించిన ఫొటోలు వైర‌ల్ కాగా, ఇందులో సునీత చాలా ఆనందంగా క‌నిపిస్తుంది.

సునీత రెండో పెళ్లిని ఇద్ద‌రు పిల్ల‌లు ద‌గ్గ‌రుండి చేస్తున్నారు. ఇన్నాళ్లు త‌న‌కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డ త‌న త‌ల్లికి ఓ తోడు కావాల‌ని భావించిన పిల్ల‌లు ఇప్పుడు మంచి ముహూర్తంలో శుభ‌కార్యం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే డిసెంబర్ 26 రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ హోటల్లో వీళ్ల ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది.. ఈ పార్టీకి సుమ‌, రేణూదేశాయ్ ప‌లువురు సింగ‌ర్స్ హాజ‌ర‌య్యారు. ఆ పార్టీలో వీరు చేసిన సంద‌డికి సంబంధించిన ఫోటోలు చాలా వైర‌ల్ అయ్యాయి.

సునీత త‌న నిశ్చితార్ధం కూడా చడిచ‌ప్పుడు కాకుండా చేసుకుంది. ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కు కాని ఆమె రెండో పెళ్ళి చేసుకుంటుంద‌నే విష‌యం తెలియ‌దు. గ‌తంలో చాలా సార్లు రెండో పెళ్లి చేసుకోన్న సునీత ఇప్పుడు రామ్ వీర‌ప‌నేనితో ఏడ‌డుగులు వేసేందుకు సిద్ద‌మైంది. పెళ్ళికి కేవలం ఇరు కుటుంబ వర్గాలు మాత్రమే రానున్నాయి.