Manchu vishnu: నాన్నకు ఆహ్వానం అందకుండా చేశారు.. వాళ్లెవరో నాకు తెలుసు… మంచు విష్ణు కామెంట్స్ వైరల్!

Manchu vishnu: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు నిన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన విషయం మనకు తెలిసిందే.అయితే టికెట్ల రేట్లు వ్యవహారం గురించి అంతకుముందే టాలీవుడ్ ప్రముఖ హీరోలు దర్శకనిర్మాతలు ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత కొద్దిరోజులకే మంచు విష్ణు సీఎం జగన్ ను కలవడానికి వెళ్లడంతో వీరిద్దరి సమావేశం గురించి పెద్ద ఎత్తున ఉత్కంఠత నెలకొంది.ఈ క్రమంలోనే మంచు విష్ణు జగన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా జగన్ తో భేటీ అనంతరం విష్ణు మాట్లాడుతూ… ఇటీవల సీఎం జగన్ ను టాలీవుడ్ హీరోలు కలిశారని,ఆ ముగ్గురితో పాటు నాన్నకు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఆహ్వానం అందిందని అయితే ఆహ్వానం నాన్నకు అందకుండా కొందరు అడ్డుకున్నారని ఈ సందర్భంగా మంచు విష్ణు తెలియజేశారు.అయితే నాన్నకు ఆహ్వానం అందకుండా అడ్డుకున్నది ఎవరో కూడా తనకు తెలుసని త్వరలోనే వారి గురించి వివరిస్తానని మంచు విష్ణు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక జగన్ తో సమావేశమైన సమయంలో తాను ఎక్కువగా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడానని విష్ణు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

అలాగే వ్యక్తిగత విషయాలతో పాటు కొన్ని ఇండస్ట్రీ సమస్యల గురించి జగన్ తో ప్రస్తావించానని ఆ విషయాలను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు అంటూ దాటవేశారు. అదే విధంగా మంత్రి పేర్ని నానిను నాన్నగారు బ్రేక్ ఫాస్ట్ కోసం ఆహ్వానించారని అయితే ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో చాలామంది తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా తన గురించి వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశారు.