Warangal: మద్యం సేవించి కారు ఎక్కాడు… వారం రోజుల తర్వాత చూసేసరికి ఇలా అయ్యాడు!

Warangal: సాధారణంగా చాలామంది మద్యం సేవించి వాహనాలు నడపడం మనం చూస్తున్నాము. అయితే కొందరు మద్యం సేవించినప్పటికీ ఎంతో జాగ్రత్తగా వారు చేరాల్సిన చోటకు చేరగా… మరికొందరు కొన్ని ప్రమాదాల బారినపడి మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండలో చోటుచేసుకుంది. అయితే వారం రోజులుగా ఒకే చోట ఆగి ఉన్న కారులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళితే…

వరంగల్ జిల్లా హన్మకొండలో నర్సంపేట్‌కు చెందిన వేల్పుకొండ రమేష్ హన్మకొండ చౌరస్తాలోని బాలాజీ స్వీట్ హోమ్ యజమాని నర్సింహా వద్ద కారు డ్రైవర్ గా పని చేస్తున్నారు. అయితే కొన్ని రోజులక్రితం కారు రిపేర్ రావడంతో ఆ కారును స్నేహ బార్ వద్ద నిలిపివేశారు. ఈ క్రమంలోనే దాదాపు వారం రోజుల తర్వాత ఆ కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఆ కారును పరిశీలించగా ఒక్కసారిగా కారు డోర్ తీసి చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.

వారంరోజులుగా బార్ వద్ద పార్క్ చేసి ఉన్న ఆ కారులో కార్ డ్రైవర్ రమేష్ మృతదేహం దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించగా అతని మరణానికి సంబంధించి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా వారం రోజుల క్రితం రమేష్ మద్యం తాగి కారులోకి ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు. అయితే మద్యం మత్తులో కారులో ఉండిపోయిన రమేష్ ఊపిరాడక మరణించి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.