కట్టుకున్న భార్యను కాదని నిజంగా అంతటికి తెగించిన భర్త?

ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కడ చూసినా కూడా వివాహేతర సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నప్పటికీ ఇలాంటి పనులు చేసే వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. అంతేకాకుండా ఈ రోజుల్లో వివాహబంధాల కంటే తాత్కాలిక పరిచయాలకు, సుఖాలకు ప్రాధాన్యత ఇచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వివాహేతర సంబంధాల వల్ల పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు. చేజేతులా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వివాహేతర సంబంధాల కోసం, చంపడానికి అయినా, చావడానికైనా సిద్ధమవుతున్నారు.

భార్యను వదిలేసి భర్త పరాయి మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, భర్తను వదిలేసి భార్య పరాయి పురుషుడితో వెళ్ళిపోతున్న ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అలాగే ఇలాంటి ఘటన ఒకటి అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ఉప్పరపల్లికి చెందిన వెంకటస్వామి, శివమ్మ దంపతులకు గురు మూర్తి అనే కుమారుడు ఉన్నాడు. గురుమూర్తికి మూడేళ్ల క్రితం ప్రసన్నాయనపల్లికి చెందిన జయలక్ష్మితో పెళ్లి అయింది. ఈ దంపతులకు కుమారుడు కూడా ఉన్నాడు. గురుమూర్తి అప్పుడప్పుడు పంగల్ రోడ్డులో ఉన్న డాబాకు వెళ్ళేవాడు. ఈ క్రమంలోనే అక్కడ డాబా లో పనిచేస్తున్న చిన్న కుంట గ్రామానికి చెందిన సాయిలీల తో పరిచయం ఏర్పడింది.వారి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

అయితే అప్పటికే స్థాయిలకు ఏడాది క్రితమే ముదిగుబ్బ మండలం బాల్య నాయక్ తండాకు చెందిన యువకుడితో పెళ్లి కాగా ఆరు నెలల క్రితమే భర్త నుంచి విడిపోయి తన తల్లి లక్ష్మీ దగ్గర ఉంటుంది. ఈ క్రమంలోనే గురుమూర్తి, సాయిలీల మధ్య పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. వీటి గురించి పెద్దలకు తెలియడంతో పెళ్లయిన తర్వాత ఇలాంటి పనులు సరికాదని సూచించారు. గురుమూర్తిని మందలించి భార్య పిల్లలు ఉండగా ఇలాంటి పనులు చేయొద్దని నచ్చచెప్పారు. దీనితో తీవ్ర మనస్తాపం చెందిన సాయి లీల, గురుమూర్తి రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న గురుమూర్తి కుటుంబ సభ్యులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లేసరికి అక్కడ ఇద్దరు అపస్మారకస్థితిలో ఉన్నారు. వెంటనే వారిద్దరినీ 108 సహాయంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.