Jabardasth:మల్లెమాల షాకింగ్ డెసిషన్..ఇక జబర్థస్త్ షో మూతపడే సమయం దగ్గర పడ్డట్టే..!

Jabardasth: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా ప్రసారమవుతున్న ఈ కామెడీ షో ఎంతోమందికి జీవితాలు ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ప్రతి వారం ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ కామెడీ షో ప్రేక్షకులను అలరిస్తూ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అయితే గత కొంత కాలంగా జబర్దస్త్ షో తరచూ వార్తల్లో నిలుస్తోంది.

కొన్ని సంవత్సరాల క్రితం జబర్దస్త్ కి మూల స్తంభం లా ఉన్న నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఈ షో యాజమాన్యం తీరు సరిగా లేదని విమర్శలు వినిపించాయి. ఈ షో ద్వారా పాపులర్ అయిన సీనియర్ కమెడియన్లు కూడా జబర్దస్త్ యాజమాన్యం గురించి విమర్శించారు. ఇటీవల ఈ
షో లో జడ్జ్ గా ఉన్న రోజా కూడా మంత్రి పదవి దక్కటంతో జబర్దస్త్ కి స్వస్తి చెప్పింది. దీంతో జబర్థస్త్ రేటింగ్స్ మరింత పడిపోయాయి. అంతె కాకుండా తమ స్కిట్ లతో జబర్థస్త్ రేటింగ్స్ పెంచిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, అదిరే అభి వంటి వారు కూడా ఈ మధ్య జబర్దస్త్ కనిపించటం లేదు. దీంతో మరొకసారి ఈ షో రేటింగ్స్ పడిపోయాయి.

అంతే కాకుండా ఈ మధ్య జబర్దస్త్ యాజమాన్యం వారు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రేక్షకులను మోసం చేస్తున్నారు. అందుకు ఉదాహరణ రష్మి పెళ్లి స్కిట్. ప్రతి వారం 1:30 పాటు ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షో ప్రస్తుతం 40 నిమిషాలు మాత్రమే ప్రసారం కానుంది. దీంతో జబర్దస్త్ రేటింగ్స్ మరింత పడిపోయే అవకాశం ఉంది. జబర్దస్త్ కామెడీ షో నుండి బయటకు వెళ్లిన కమెడియన్లు చేసే విమర్శలతో పాటు ఇలా షో టైమింగ్స్ తగ్గించటం వల్ల ఈ షోకి పెద్ద దెబ్బ పడనుంది. దీంతో ఈ షో మూతపడటం ఖాయం అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.