జబర్దస్త్ గురించి వస్తున్న వార్తలపై స్పందించిన మల్లెమాల..ఎవరికోసమో ఈ షో ఆగదు..!

ప్రస్తుతం ఎన్నో టీవీ షోలు బుల్లితెర మీద ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఈ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ప్రతి వారం గురు శుక్రవారాలలో ప్రసారమయ్యే జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ షో లు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇదిలా ఉండగా కొంతకాలంగా జబర్ధస్త్ రేటింగ్స్ చాలా దారుణంగా పడిపోతున్నాయి.

అందుకు కారణం కూడ లేకపోలేదు. జబర్దస్త్ ద్వార బాగా పాపులర్ అయిన హైపర్ ఆది, సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను, అదిరే అభి వంటి ప్రముఖ కమెడియన్లు ప్రస్తుతం జబర్దస్త్ లో కనిపించడం లేదు. వీరు జబర్ధస్త్ నుండి వెల్లిపోవటానికి పలు రకాల సమాధానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకూ వీరిలో ఎవ్వరూ కూడా తాము జబర్ధస్త్ ని విడచి వెళ్లేందుకు గల కారణం గురించీ స్పందించలేదు. గత కొన్ని రోజులుగా జబర్ధస్త్ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా జబర్ధస్త్ గురించి మరొక వార్త కూడా హల్ చల్ చేస్తోంది. ప్రముఖ కమెడియన్లు జబర్ధస్త్ ని విడచి వెళ్ళటంతో జబర్ధస్త్ షో ని మూసేసి కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ షో మాత్రమే కొనసాగిస్తారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై మల్లెమాల వారు స్పందించారు. ఎప్పటిలాగే జబర్ధస్త్ అధిక రేటింగ్స్ తో దూసుకుపోతూ టాప్ షో గా కొనసాగుతోంది అంటూ మల్లెమాల వారు చెప్పుకొచ్చారు. కొంతమంది వ్యక్తుల వల్ల ఈ షో ఇంత సక్సెస్ కాలేదు. ఎవరికోసమో ఈ షో నిలిపివేసే ప్రసక్తి లేదంటూ తేల్చి చెప్పారు. వెళ్లిపోయిన వారి స్థానంలోకి కొత్త వ్యక్తులు వస్తున్నారు . వారితో షో జబర్దస్త్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది అంటూ మల్లెమాల వారు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మునుపటిలా జబర్ధస్త్ మళ్లీ నెం 1 స్థానంలో నిలుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.